ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

పౌలు రోమా 3 లోని విషయాన్ని ముగింపుకు నడిపిస్తున్నాడు, మనలో ఎవరూ దేవుని పరిపూర్ణతను మరియు పవిత్రతను అంచనా కూడా వేయలేరు. కాబట్టి మనము అక్కడికి ఎలా వెళ్తాము? పాపం గొంతు పిసికి మనం ఎలా తప్పించుకుంటాము? ఈ ప్రశ్నకు దేవుని సమాధానం యేసు ! మన సమాధానం అదే అని నేను నమ్ముతున్నాను! మనుష్య కుమారుడు ..... అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను. (మార్కు 10:45) మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. (రోమన్లు 5: 6-11) మన మంచితనం ద్వారా మనం దేవుని వైపుకు వెళ్ళలేము, కాబట్టి యేసు తిరిగి దేవునికి మన వంతెన అయ్యాడు. అద్భుతమైన సత్యం ఇది: ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను. (2 కొరింథీయులు 5:21)

నా ప్రార్థన

పవిత్రమైన మరియు నీతిమంతుడైన దేవా, నా జీవితంలో చేసిన పాపత్వాన్ని మీ ముందు అంగీకరిస్తున్నాను. అయినప్పటికీ విశ్వాసం ద్వారా, యేసు తన మరణం, ఖననం మరియు పునరుత్థానం ద్వారా నాకు ప్రాణం తెచ్చేందుకు మరియు మీ దృష్టిలో నన్ను పవిత్రంగా మార్చడానికి చేసిన దానిని నేను నమ్ముచున్నాను . అటువంటి అద్భుతమైన దయ వల్ల మీ విజయవంతమైన బిడ్డగా జీవించడానికి దయచేసి నన్ను ఆశీర్వదించండి మరియు శక్తివంతం చేయండి. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్.

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు