ఈనాటి వచనమునుగూర్చిన తలంపు

పైన చెప్పబడిన వాస్తవాలు డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గారిచే చెప్పబడినట్లుగా ఆయనకు ఆపాదిస్తుంటారు ,వాస్తవానికి ఇది అమోసు చేత చెప్పబడినది.డాక్టర్ కింగ్ కంటే 2600 సంవత్సరాల క్రితం దేవుని ప్రతినిధి దీనిని పేర్కొన్నాడు. దేవుడు తన ప్రజలు కరుణ, వ్యక్తిత్వము మరియు ఇతరులను గూర్చిన చింతనతో నిండిన జీవితాలు కలిగియుండకుండా వారి మతపరమైన యాత్రలు, బలి అర్పణలు మరియు వారి పాటలు ద్వారా ఏ లాభము ఉండదని తన ప్రజలు తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఉత్తర ఇశ్రాయేలు ఆమోసును నమ్మలేదు మరియు మారుమనస్సు పొందలేదు . ఎన్నో సంవత్సరాల గడవక ముందే, వారు పూర్తిగా నాశనం చేయబడ్డారు, ఎందుకంటే దేవుడు వారి వేషధారణను, అన్యాయాన్ని, బలహీనులపట్ల అపరాధభావమును చూశాడు. కానీ మనమైతే ఈ కాలమందు జీవిస్తున్నాము, మరియు ఈ మాటలు ఇప్పుడు కూడా అప్పడు ఉన్నంత శక్తివంతంగా మరియు స్పష్టంగా ఉన్నాయి! ఐతే మన స్పందన ఏమిటి?

నా ప్రార్థన

సర్వశక్తిమంతుడైన దేవా, నీ పిల్లలు చాలామంది నేడు మన ప్రపంచంలో మరియు మన దేశాల్లో జరుగుచున్న అవినీతిని బట్టి సిగ్గు పడుతున్నారు. దయచేసి వారి స్వభావము మారి వారిలో నూతన స్వభావము జన్మించునట్లుగా వారిని నడపడానికి మమ్మును ఉపయోగించండి. మరియు తండ్రి, మేము పవిత్ర జీవితాలను గడపాలని కోరుకుంటూ, మీ ప్రేమను తెలుసుకొని, రక్షణ పొందాలనుకునే వారికి మీ కరుణ, దయ, కృప సున్నితత్వం వంటి గుణగణాలను పంచునట్లు మా కన్నులు మీ స్వభావము పై మాత్రమే కాక మీ గుణగణాలపై కూడా ఉంచండి.యేసు నామములో ప్రార్ధించుచున్నాను.ఆమెన్

ఈనాటి వచనం" లోని భావన మరియు ప్రార్థన ఫీల్ వారే గారిచే వ్రాయబడినవి.

మీ అభిప్రాయములు